There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
హిందూ మహాసముద్ర ప్రాంతంలో (IOR) 7,516.6 కి.మీ. తీర రేఖ మరియు 1,200 కంటే ఎక్కువ ద్వీప ప్రాంతాలతో భారతదేశం వ్యూహాత్మక సముద్ర మార్గాల మధ్యలో ఉంది. ఈ మార్గాల ద్వారా ప్రపంచ ముడిచమురులో 80% మరియు భారతదేశ వాణిజ్యంలో 90% వ్యాపారం జరుగుతుంది. ఇది 21వ శతాబ్దపు సముద్ర రాజకీయాలు మరియు ప్రపంచ సంధానతలో భారతదేశ స్థానాన్ని కీలకంగా మారుస్తుంది.
విషయం:
I. భారతదేశ స్థానం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత:
1. సముద్ర కేంద్రీకరణ:
-హిందూ మహాసముద్రం యొక్క ప్రధాన భాగంలో భారతదేశం ఉంది. దీంతో భారతదేశం పర్షియన్ గల్ఫ్ నుండి ఆగ్నేయ ఆసియాకు సంధానం కల్పించే కీలక సముద్ర మార్గాల (SLOCs) పై నియంత్రణ కలిగి ఉంది. ఇవి ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా వ్యవహరిస్తారు.
2. జలసంధుల సామీప్యత:
-హోర్ముజ్ జలసంధి, మలక్కా జలసంధి, మరియు బాబ్-ఎల్-మండేబ్ లకు భారతదేశం సమీపంలో ఉంది. ఈ మార్గాల ద్వారా ప్రపంచ ముడిచమురు 80% ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. దీనివల్ల భారతదేశం వ్యూహాత్మక నిరోధక శక్తి మరియు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది.
3. ద్వీపాల ప్రయోజనం:
-అండమాన్ & నికోబార్ కమాండ్ భారతదేశ ఏకైక త్రి-సేవా స్థావరం, ఇది మలక్కా జలసంధిని పర్యవేక్షిస్తుంది. ఇది చైనా మరియు ఆసియాన్ దేశాల రాకపోకలకు సముద్ర ప్రవేశ స్థానం కావడం విశేషం.
4. నౌకా సౌకర్యాలు:
-INS బాజ్, INS కదంబ, మరియు కర్వార్ వంటి స్థావరాలు సముద్ర రక్షణకు ముందస్తు సామర్థ్యాన్ని అందిస్తాయి.
5. పర్యవేక్షణ వ్యవస్థ:
-సమీకృత తీర ప్రాంత నిఘా వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ కోస్టల్ సర్వైలెన్స్ సిస్టమ్-ICSS) మరియు హిందూ మహాసముద్ర తీర దేశాలతో సహకారం సముద్ర అవగాహనను మరియు శత్రు నిరోధక గస్తీలను బలపరుస్తాయి.
II భారతదేశం సముద్ర స్థానం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత:
1. శక్తి జీవనాడి:
-భారతదేశ ముడి చమురు దిగుమతులలో 70% కంటే ఎక్కువ మరియు వాణిజ్యంలో 90% హిందూ మహాసముద్ర మార్గాల ద్వారా జరుగుతాయి. సముద్ర భద్రతపై ఆర్థికంగా ఆధారపడటాన్ని ఇది తెలియజేస్తుంది.
2. నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి:
-చేపల వేట, షిప్పింగ్, సముద్రతల గనులు, మరియు ఆఫ్షోర్ శక్తి ద్వారా భారతదేశ తీర ఆర్థిక వ్యవస్థ GDPలో 4% వాటా కలిగి ఉంది. సాగరమాల కార్యక్రమం ద్వారా ఇది వ్యూహాత్మకంగా ప్రోత్సహించబడుతోంది.
3. ఓడరేవుల అభివృద్ధి:
-ముంద్రా, కాండ్లా, చెన్నై, మరియు విశాఖపట్టణం వంటి ఓడరేవులు తీర ఆర్థిక మండలాల (CEZs) ద్వారా ప్రపంచ వాణిజ్య కేంద్రాలుగా మారుతున్నాయి.
4. ఆసియా మరియు ఆఫ్రికాకు వాణిజ్య ప్రవేశం:
-సముద్ర సామీప్యత భారతదేశ యొక్క యాక్ట్ ఈస్ట్ మరియు సముద్ర ఆఫ్రికా విధానాన్ని సులభతరం చేస్తుంది. ప్రాంతీయ సరఫరా గొలుసులలో భారతదేశ పాత్రను బలపరుస్తుంది.
5. వ్యూహాత్మక ఖనిజాలు మరియు సంధానత:
-భారతదేశం లోతైన సముద్ర గనులు మరియు డిజిటల్ సంధానత కోసం సముద్రతల కేబుల్స్ను అన్వేషిస్తోంది. IORలో దాని వ్యూహాత్మక అడుగులను విస్తరిస్తోంది.
III. భారతదేశ స్థానం యొక్క రాజకీయ ప్రభావం:
1. భద్రత వ్యూహాలు:
-SAGAR (ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధి) సిద్ధాంతం ద్వారా, భారతదేశం IORలో మానవతా, శత్రు నిరోధక, మరియు విపత్తు స్పందన ప్రయత్నాలను కొనసాగిస్తుంది.
2. ప్రాంతీయ దౌత్యం:
-ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA) మరియు ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (IPOI)లో భారతదేశ నాయకత్వం సముద్ర పాలనను సమ్మిళితంగా పెంపొందిస్తుంది.
3. నౌకా దౌత్యం మరియు వ్యాయామాలు:
-మలబార్ (QUAD), మిలాన్ (MILAN), మరియు ఫ్రాన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక వ్యాయామాలలో పాల్గొనడం వ్యూహాత్మక నిరోధక శక్తిని పెంచుతుంది.
4. చైనాకు ప్రతిబంధం:
-భారతదేశ స్థానం చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్పై వ్యూహాత్మక పర్యవేక్షణను అనుమతిస్తుంది. అలాగే స్వేచ్ఛాయుత మరియు బహిరంగ ఇండో-పసిఫిక్ వాణిజ్యాన్ని సమర్థించడానికి QUADలో భాగస్వామ్యం చేస్తుంది.
5. సాంకేతిక మరియు పర్యవేక్షణ భాగస్వామ్యాలు:
-ఫ్రాన్స్, అమెరికా, మరియు జపాన్తో ఉపగ్రహ ట్రాకింగ్ మరియు వైట్ షిప్పింగ్ ఒప్పందాలపై సహకారం ఇంటెలిజెన్స్ షేరింగ్ మరియు సముద్ర మార్గ భద్రతను బలపరుస్తుంది.
ముగింపు:
నేటి రాజకీయాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వం బలమైన భాగస్వామ్యాలు, వాతావరణ స్థితిస్థాపకత, మరియు బలమైన నౌకా శక్తిపై ఆధారపడి ఉన్నాయి. ప్రాచీన సామెత ప్రకారం , “భారత మహాసముద్రాన్ని నియంత్రించేవాడు ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రిస్తాడు”—భారతదేశం SAGAR మరియు మహాసాగర సిద్ధాంతాల ద్వారా ఈ ప్రాంతంలో భద్రత మరియు ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహించేలా తనను తాను రూపొందించుకుంటోంది.